జగన్ యూకే టూర్‌పై నేడు సీబీఐ కోర్టు తీర్పు..

ABN, Publish Date - May 14 , 2024 | 09:57 AM

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటనపై మంగళవారం నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటనపై మంగళవారం నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు యూకే పర్యటనకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందని... లండన్‌లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళుతున్నట్లు జగన్ చెప్పారు. అయితే జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతోందని, ఈ దశలో విదేశీ పర్యటనలకు జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో భారీగా క్రాస్ ఓటింగ్..

ఏపీలో ఫలితాలపై రూ. కోట్లలో బెట్టింగ్‌లు..

నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు

ఈసారి ఊహించని ఫలితాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 14 , 2024 | 09:57 AM