PM Modi: అరకు కాఫీపై మోదీ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 30 , 2024 | 06:42 PM

మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ‘మన్ కీ బాత్‌’లో ప్రసంగించారు. ఆంధ్ర ప్రత్యేక కాఫీ గురించి ప్రధాని ప్రస్తావించారు. అరకు ఏజెన్సీలో పండించే ప్రత్యేక కాఫీ గురించి మోదీ దేశ ప్రజలకు వివరించారు.

అరకు: మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ‘మన్ కీ బాత్‌’లో ప్రసంగించారు. ఆంధ్ర ప్రత్యేక కాఫీ గురించి ప్రధాని ప్రస్తావించారు. అరకు ఏజెన్సీలో పండించే ప్రత్యేక కాఫీ గురించి మోదీ దేశ ప్రజలకు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని అధిక మొత్తంలో పండిస్తారని తెలిపారు. ఈ కాఫీ అద్భుతమైన రుచి, సువాసనకు ప్రసిద్ధి గాంచిందని ప్రధాని మోదీ కొనియాడారు. స్థానిక ఉత్పత్తులకు ప్రజాదారణ పొందాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Updated at - Jun 30 , 2024 | 06:42 PM