వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.2.11లక్షలు
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:35 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు.

ఆత్రేయపురం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్యకల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.2,11,586 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.
సినీనటుడు చంద్రకాంత్ పూజలు: వాడపల్లి వేంకటేశ్వరస్వామిని మంగళవారం రాత్రి సినీ నటుడు చంద్రకాంత్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలుకగా, స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటం అందించారు.