Share News

RRR: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ.. ఎందుకంటే

ABN , Publish Date - Jan 26 , 2025 | 09:15 AM

ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసుకు సంబంధించి కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా జైల్లో న్యాయమూర్తి సమక్షంలో పోలీసులు పరేడ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రఘురామ గుంటూరు జైలుకు వస్తున్నారు.

RRR: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ.. ఎందుకంటే
Raghurama

గుంటూరు జిల్లా: కస్టోడియల్ టార్చర్ కేసు (Custodial torture case)లో గుంటూరు జిల్లా జైల్లో నిందితుడిని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ (AP Deputy Speaker) రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnam Raju) గుర్తించనున్నారు. దీని కోసం జిల్లా న్యాయమూర్తి సమక్షంలో పోలీసులు ఆదివారం పరేడ్ (Parade) నిర్వహించనున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని రిమాండ్‌లో ఉన్న తులసి బాబు కోర్టును ఆశ్రయించారు. దీంతో తులసిబాబు పోలికలతో ఉన్న వ్యక్తులతో రఘురామకు పరేడ్ నిర్వహించనున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఐడీ ఏఎస్సీ విజయ్‌పాల్ అరస్టయి గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ఈ వార్త కూడా చదవంటి..

నాలుగు పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం..


రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు..

కాగా కస్టోడియల్‌ టార్చర్‌ కేసుకు సంబంధించి విచారణకు పిలిచిన కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు కేసు విచారణ చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌కు ఆయన లేఖ రాశారు. 2021 మే 14 రాత్రి సీఐడీ అధికారులు కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేసిన సమయంలో 115 కిలోల బరువు ఉన్న పొడవాటి వ్యక్తి తన ఛాతీపైన కూర్చున్నారని తనకు కొంతమంది చెప్పారని, ఆ వ్యక్తి తులసిబాబుగా భావిస్తున్నానని రఘురామ తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన తులసిబాబు అప్పట్లో సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ అవినీతికి చీఫ్‌ కలెక్షన్‌ ఏజెంటుగా, కుడి భుజంగా ఉండేవాడని తెలిసిందన్నారు. అతనిని విచారణ పిలిచిన రోజు తనకు అనుమతి ఇస్తే గుర్తుపట్టగలనని ఆ లేఖలో పేర్కొన్నారు.


కాగా.. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి అయిన తులసిబాబును ఈనెల 8న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విచారణ జరిపిన పోలీసులు ఆపై అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసు కస్టడీలో ఉన్న రిటైర్డ్‌ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను తులసి బాబును ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నలు సంధించారు. అనంతరం విజయ్‌పాల్‌ను పంపించి వేసి తులసి బాబు ప్రత్యేకంగా విచారించారు. ఈ క్రమంలో కొంత మేర సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల విచారణకు సహకరించకపోవడంతో పాటు బలమైన ఆధారాలు ఉండటంతో తులసిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నందమూరి అభిమానులందరికీ ఇదోక ముఖ్యమైన క్షణం

తెలుగు రాష్ట్రాలకు సప్త పద్మాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 26 , 2025 | 09:41 AM