Share News

YS Jagan: తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది: వైఎస్ జగన్

ABN , Publish Date - Feb 19 , 2025 | 12:54 PM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గుంటూరు పర్యటనకు వచ్చిన ఆయన మిర్చి యార్డ్‌కు వెళ్లి రైతులను పరామర్శించారు. వారితో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల కోడ్ అంటూ కనీసం పోలీస్ అధికారులు లేకుండా చేశారని అన్నారు.

YS Jagan: తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది: వైఎస్ జగన్
YS Jagan

గుంటూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు (YSRCP Chief), మాజీ సీఎం జగన్ (Ex CM Jagan) బుధవారం గుంటూరు (Guntur) పర్యటనకు వెళ్లారు. అక్కడ మిర్చి యార్డ్‌ (Mirchi Yard)కు వెళ్లి రైతులను పరామర్శించారు. ఎన్నికల కోడ్ (Election Code) కారణంగా రాజకీయ సమావేశాలు, సభలకు అనుమతి లేదని, జగన్‌ గుంటూరు పర్యటనకు రావద్దని, ఈసీ జిల్లా కలెక్టర్ (Guntur Dist. Collector) ఆదేశాలు జారీ చేసినా వాటిని జగన్ భేఖాతరు చేశారు. జగన్ రాక నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు జై జగన్ అంటూ వీరంగం సృష్టించారు.

ఈ వార్త కూడా చదవండి..

పోలీసుల అదుపులో వైట్ కాలర్ దళారీ


మిర్చి యార్డ్‌లో వైఎస్ జగన్ రెడ్డి కామెంట్స్..

రైతులను పరామర్శించి.. వారితో మాట్లాడిన అనంతరం ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కోడ్ అంటూ కనీసం పోలీస్ అధికారులు లేకుండా చేశారని అన్నారు. రాష్ట్రంలో ఏ పంటకు కనీసం మద్దతు ధర లేదని, మిర్చి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. తమ ప్రభుత్వంలో అత్యధిక మద్దతు ధర ఇచ్చి రైతుల్ని ఆదుకున్నామని చెప్పారు. ఇప్పుడు రైతు సమస్యలపై మాట్లాడటానికి వస్తుంటే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ‘‘తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది.... ఆరోజు చంద్రబాబుకి కనీసం సెక్యూరిటీ లేకుండా చేయగలం.. సచివాలయానికి మిర్చి యార్డ్‌కు ఎంత దూరం ఉంది... రైతుల కష్టాలు కనీసం నీకు పట్టడం లేదు’’ అని జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.


కాగా ఏపీలో కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని రాజకీయ నేతలు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జగన్ గుంటూరు పర్యటన కోసం మంగళవారం ఈసీకి అనుమతి కోరారు. అందుకు ఈసీ నిరాకరించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉందని పర్యటించవద్దని ఆదేశించింది. ఈసీ ఆదేశాలను జగన్ ఉల్లంఘించి.. బుధవారం గుంటూరులో పర్యటించారు. యార్డ్‌లోకి వస్తే కేసులు నమోదవుతాయని గుంటూరు జిల్లా కలెక్టర్ హెచ్చరించినా వాటిని జగన్, వైఎస్సార్‌సీపీ నేతలు పట్టించుకోలేదు. అధికారుల ఆదేశాలు లెక్కచేయకుండా జగన్ గుంటూరు మిర్చి యార్డ్‌కు వెళ్లారు.

ఎన్నికల కోడ్ ఉన్న నేపధ్యంలో మిర్చి యార్డులో రాజకీయ ఫోటోలు, ఫ్లెక్సీలు, సమావేశాలు నిర్వహించడం నిషేధం అంటూ అధికారులు మైకులో ప్రచారం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఎన్సౌన్ మెంట్ చేశారు. అయితే జగన్ పర్యటన జరిపేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఎలాగైనా జగన్ గుంటూరు పర్యటనకు వస్తారని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈసీ నిబంధనలు పట్టించుకోని జగన్..

ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఇక్కడంటే..

ఢిల్లీ నూతన సీఎంపై స్పష్టత..

గుంటూరు మిర్చి యార్డుకు జగన్ రెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 19 , 2025 | 12:54 PM