నవరత్నాల రథంపై ప్రహ్లాదరాయలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:25 AM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై విహారించారు.

మంత్రాలయం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై విహారించారు. గురువారం త్రయోదశి శుభ దినాన్ని పురస్కరించుకుని రాఘవ్రేంద్రస్వామి మూల బృందావనానికి పూజలు నిర్వహించారు. నవరత్నాల బంగారు రథంపై ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు.
ఫ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సందడిగా మారింది. గురువారం దక్షిణాది రాష్ర్టాలనుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహదారులు, మధ్వమార్గ్ కారిడార్, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్ర నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది.