ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలి
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:11 AM
రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్ చార్జీలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
ఏపీ ఈఆర్సీ ఎదుట సీపీఐ నిరసన
కల్లూరు, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్ చార్జీలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం కల్లూరులోని ఏపీఈఆర్సీ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వం ఇస్టానుసారంగా వేసిన యూజర్ చార్జీలను తగ్గిస్తామని అప్పట్లో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ మేరకు ఇప్పుడు సెకీ ఒప్పందాన్ని ఉపసంహరించుకుని యూజర్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పీపీఏ ఒప్పందంపై కమిషన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఏపీఈఆర్సీ ఇన్చార్జ్ చైర్మన్ పీవీఆర్ రెడ్డికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, నాయకులు రామకృష్ణారెడ్డి, గిడ్డమ్మ, శ్రావణి, భారతి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.