Minister Dola : ‘ఆదర్శ గ్రామ’ నిధులు విడుదల చేయండి
ABN , Publish Date - Feb 08 , 2025 | 04:21 AM
సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిని కోరారు.

కేంద్ర మంత్రికి మంత్రి డోలా విజ్ఞప్తి
అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి రావాల్సిన ఆదర్శ గ్రామ పథ కం నిధులు విడుదల చేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన డోలా పీఎం-అజయ్ ఆదర్శ గ్రామ పథకం కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన 526 గ్రామాలకు రూ.110 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం అందించారు. వాటన్నింటికీ కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని మంత్రి డోలా తెలిపారు.