ఈవీఎంల భద్రతకు పటిష్ఠ ఏర్పాట్లు
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:41 PM
ఈవీఎంల భద్రతకు పటిష్ఠమైన చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.

కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, మార్చి 27(ఆంధ్ర జ్యోతి): ఈవీఎంల భద్రతకు పటిష్ఠమైన చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో గల ఈవీఎం గోదాములను వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి గురువారం ఈయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎంల భద్రతా పరంగా ఎటువంటి లోపాలు లేకుండా, క ట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్ని కల నిబంధనల మేరకు మూడు నెలలకో సారి ఈవీఎం గోదాములను తనిఖీ నిర్వ హించడం జరగుతుందన్నారు. ఈవీఎంల ను ట్రిపుల్ లాక్ పద్ధతిలో భద్రపరచడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధు ల సమక్షంలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ, సీపీఎం, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన పీంఎజే బాబు, సురేష్సింగ్ బాబు, రౌతు శంకరరావు, ఎం.గోవింద్, బి.అర్జున్ కుమార్, సీహెచ్ భాస్కరరావు, కేవీ ఎల్ఎన్ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.