TTD: రేపటి నుంచి తెలంగాణ సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శనం
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:18 AM
ఆదివారం సిఫారసు లేఖలను టీటీడీ స్వీకరించనుంది. అయితే, 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినందున, 24, 29 తేదీల్లో మాత్రం సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.

ఏపీ ప్రజాప్రతినిధులకు సోమవారం బ్రేక్ కట్
తిరుమల, మార్చి 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు శ్రీవారి దర్శనం సోమవారం నుంచి అమలు కానుంది. ఆదివారం సిఫారసు లేఖలను టీటీడీ స్వీకరించనుంది. అయితే, 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినందున, 24, 29 తేదీల్లో మాత్రం సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై సోమ, మంగళవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు.. బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక దర్శనాలు కల్పిస్తారు. ఈ క్రమంలో ఏపీ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై ఇకపై సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. దీనికి బదులుగా ఆదివారం అనుమతిస్తారు.
ఇవి కూడా చదవండి:
Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News