Share News

కలెక్టరేట్‌లో పీ4 పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , Publish Date - Mar 20 , 2025 | 10:58 PM

రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా శాఖ రూపొందించిన పీ4 (పబ్లిక్‌, ప్రైవేటు, పీపుల్స్‌ పార్ట్‌నర్‌షిప్‌) పోస్టర్‌ను అధికారులతో కలిసి కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ గురువారం ఆవిష్కరించారు.

కలెక్టరేట్‌లో పీ4 పోస్టర్‌ ఆవిష్కరణ
పీ4 పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఇతర అఽధికారులు

పాడేరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా శాఖ రూపొందించిన పీ4 (పబ్లిక్‌, ప్రైవేటు, పీపుల్స్‌ పార్ట్‌నర్‌షిప్‌) పోస్టర్‌ను అధికారులతో కలిసి కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ గురువారం ఆవిష్కరించారు. పీ4 విధానంతో పేదరికం లేని సమాజాన్ని రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర- 2047 సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, డీఎస్‌పీ సహబాజ్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌(టీడబ్ల్యూ) లోకేశ్‌, సీపీవో పట్నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 10:58 PM