బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
ABN , Publish Date - Mar 20 , 2025 | 10:53 PM
ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై గురువారం ఒడిశా చిత్రకొండ ఓహెచ్పీసీ కార్యాలయంలో ఆంధ్ర, ఒడిశా రాష్ర్టాల అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఫోటో రైటప్:
20ఎస్ఎల్ఆర్5:
- ఆంధ్ర, ఒడిశా నీటి వాటాలపై చర్చించిన అధికారులు
సీలేరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై గురువారం ఒడిశా చిత్రకొండ ఓహెచ్పీసీ కార్యాలయంలో ఆంధ్ర, ఒడిశా రాష్ర్టాల అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. 2024- 2025 నీటి సంవత్సరంలో ఏ రాష్ట్రం ఎంత నీటిని వినియోగించుకుందో లెక్కలు కట్టారు. దీని ప్రకారం జూలై 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు ఒడిశా తన వాటాగా 68.8672 టీఎంసీలు వినియోగించుకున్నట్టు, ఆంధ్రా తన వాటాగా 50.7564 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్టు లెక్కలు తేల్చారు. దీని ప్రకారం ఒడిశా.. ఆంరఽధ కంటే ఇప్పటి వరకు 18.1108 టీఎంసీలు అధికంగా వినియోగించుకున్నట్టు నిర్ధారించారు. అలాగే ప్రస్తుతం బలిమెల, జోలాపుట్ జలాశయాల్లో 57.9941 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో ఏపీ వాటా 38.0525 టీఎంసీలు గానూ, ఒడిశా వాటా 19.9416 టీఎంసీలుగా ఇరు రాష్ర్టాల అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తి, ఇరిగేషన్ అవసరాల నిమిత్తం 8500 క్యూసెక్కుల నీటిని ఆంధ్రాకు, 2000 క్యూసెక్కుల నీటిని ఒడిశాకు బలిమెల జలాశయం నుంచి విడుదల చేయడానికి ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య ఏకగ్రీవంగా ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో ఒడిశా పొట్టేరు ఇరిగేషన్ సీఈ పితబాస్ శెట్టి, బలిమెల జనరల్ మేనేజర్ జ్యోతిర్మయి దాస్, డిప్యూటీ మేనేజర్ కీర్తి లొమగ, అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్కుమార్ ఐచ్ పాల్గొనగా, ఆంధ్రా తరఫున సీలేరు కాంప్లెక్సు సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.చంద్రశేఖర్రెడ్డి, ఈఈలు ఎం.శీనివాసరావు, వి.రాజేంద్రప్రసాద్, ఏడీఈ దుర్గా శ్రీనివాసరావు, ఏఈఈ సీహెచ్ సురేశ్ పాల్గొన్నారు.