Share News

మోదకొండమ్మను తాకిన సూర్యకిరణాలు

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:00 PM

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఆలయ గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని గురువారం సూర్యోదయం వేళ భానుడి కిరణాలు తాకాయి.

మోదకొండమ్మను తాకిన సూర్యకిరణాలు
సూర్యకిరణాలు తాకడంతో ప్రకాశవంతంగా కనిపిస్తున్న మోదకొండమ్మ అమ్మవారి విగ్రహం

పరవశించిన భక్తులు

పాడేరురూరల్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఆలయ గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని గురువారం సూర్యోదయం వేళ భానుడి కిరణాలు తాకాయి. దీంతో అమ్మవారి విగ్రహం ప్రకాశవంతంగా కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకుడు సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు.

Updated Date - Mar 20 , 2025 | 11:00 PM