Share News

గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువకులు

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:20 AM

మండలంలోని మోదవలస జంక్షన్‌ చెక్‌ పోస్ట్‌ శివార్లలో గంజాయి సేవిస్తున్న యువకులపై బుధవారం డెంకాడ ఎస్‌ఐ సన్యాసినాయుడు, సిబ్బంది దాడులు చేశారు.

గంజాయి సేవిస్తూ పట్టుబడిన  యువకులు

డెంకాడ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మోదవలస జంక్షన్‌ చెక్‌ పోస్ట్‌ శివార్లలో గంజాయి సేవిస్తున్న యువకులపై బుధవారం డెంకాడ ఎస్‌ఐ సన్యాసినాయుడు, సిబ్బంది దాడులు చేశారు. నలుగురు యువకుల ను అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు మొబైల్‌ ఫోన్లు, మోటారు సైకిల్‌, 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన ఎర్నాగుల గిరి బాబు, విశాఖపట్నం పెందుర్తి మండలానికి చెందిన బైల పూడి లక్ష్మీనర సింహనాయుడు, ఆనందపురం మండలం నీలకుండీలకు చెందిన షేక్‌ హాబీబీ (అభి), అనకాపల్లి జిల్లా చీడికాడ మండలానికి చెందిన గంజి వెంక ట్రావు ఉన్నారని డెంకాడ ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు.

Updated Date - Apr 03 , 2025 | 12:20 AM