Sabarmati Ashram: గాంధీ మునిమనవడి పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం
ABN , Publish Date - Apr 01 , 2025 | 03:41 PM
ప్రతిపాదిత ప్రాజెక్టు వల్ల మహాత్మాగాంధీ సిద్ధాంతాలు, ఆదర్శాలను భావితరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మానం అభిప్రాయపడింది. తాము అన్ని అంశాలను పరిశీలించామని, అభ్యంతరం పెట్టడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించింది.

న్యూఢిల్లీ: అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమాన్ని (Sabarmati Ashram) రూ.1,200 కోట్లతో ఆధునీకరించాలని గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ (Tushar Gandhi) వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారంనాడు కొట్టి వేసింది. రెండున్నరేళ్ల తర్వాత పిటిషన్ వేయడాన్ని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్తో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
Dharmendra: సీనియర్ నటుడికి ఐ సర్జరీ.. ఐయామ్ స్ట్రాంగ్ అంటూ ఫ్యాన్స్కి అభివాదం
ప్రతిపాదిత ఆధునికీకరణ వల్ల శతాబ్దాల చరిత్ర ఉన్న పాత ఆశ్రమం టోపోగ్రఫీ దెబ్బతింటుందని, ఇందువల్ల పలు భవనాలను ధ్వంసం చేయడం లేదా పునర్నిర్మాణం చేసే అవకాశాలున్నాయని పిటిషనర్ వాదించారు. అయితే, ప్రస్తుతం ఉన్న ఆశ్రమాన్ని చెక్కుచెదరనీయమని, ఎలాంటి మార్పులు చేయమని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రతిపాదిత ప్రాజెక్టు వల్ల మహాత్మాగాంధీ సిద్ధాంతాలు, ఆదర్శాలను భావితరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ధర్మానం అభిప్రాయపడింది. తాము అన్ని అంశాలను పరిశీలించామని, అభ్యంతరం పెట్టడానికి ఏమీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తుషార్ గాంధీ పిటిషన్ను కొట్టివేసింది.
అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమాన్ని రూ.1,200 కోట్లతో ఆధునీకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గుజరాత్ హైకోర్టు 2022లో సమర్ధించింది. ఆ నిర్ణయాన్ని తుషార్ గాంధీ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లు.. ఆమోదం పొందుతుందా.. ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే
ఘోర ప్రమాదం.. మంటల్లో కాలి 12 మంది మృతి
మొగలుల పాలనా అంశాల్ని పాఠ్య పుస్తకాల నుంచి ఎందుకు తొలగించారు : సోనియా గాంధీ
For National News And Telugu News