Coastal Railway Corridor: కోస్తా రైల్వే కారిడార్ను అభివృద్ధి చేయాలి
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:51 AM
సోమవారం లోక్సభలో రైల్వే డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్పై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘రాష్ట్రానికి ఈ సారి రైల్వే బడ్జెట్లో రూ.9,417 కోట్లు కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపులు రాష్ట్ర పురోగతికి కేంద్ర నిబద్ధతను ప్రతిబింబిస్తాయి.

లోక్సభలో జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
న్యూఢిల్లీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ‘అన్నవరం నుంచి బాపట్ల వరకు ప్రధాన తీరప్రాంత జిల్లాలు, ఓడ రేవులను కలుపుతూ కోస్తా రైల్వే కారిడార్ను తక్షణమే అభివృద్ధి చేయాలి’ అని జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కోరారు. సోమవారం లోక్సభలో రైల్వే డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్పై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘రాష్ట్రానికి ఈ సారి రైల్వే బడ్జెట్లో రూ.9,417 కోట్లు కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపులు రాష్ట్ర పురోగతికి కేంద్ర నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. కోస్తా కారిడార్ పూర్తి చేయడానికి 30కి.మీ. కొత్త రైల్వే ట్రాక్, గేట్ వే పోర్టు, కాకినాడ పోర్టుల మధ్య లింక్ అవసరమవుతుంది. రైల్వే మంత్రి వెంటనే ఈ కారిడార్ సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని చేపట్టాలి’ అని తంగెళ్ల విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం
YSR Kadapa District: కేబినెట్లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు
PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్