పదో తరగతి పరీక్షలు టెన్షన్ పడొద్దు!
ABN, Publish Date - Mar 17 , 2025 | 12:33 PM
తూర్పుగోదావరి జిల్లాలో 134 పరీక్షా కేంద్రాలలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.

రాజమహేంద్రవరం/సిటీ మార్చి17 25,723 మంది విద్యార్థులు 134 పరీక్షా కేంద్రాలలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు

ఈ మేరకు ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం నుంచి మార్చి 31 లేదా ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

జిల్లాలో పది పరీక్షలకు 25,723 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.

రెగ్యులర్ విద్యార్థులు 24,763 మందికి బాలురు 12791 మంది, బాలికలు 11972 మంది, ప్రైవేటు విద్యార్థులు 960 మంది అందులో బాలురు 591 మంది, బాలికలు 369 మంది ఉన్నారని తెలిపారు.

ఈ పరీక్షలు నిర్వహణకు 1100 మంది ఇన్విజిలేటర్లు నియమించినట్టు తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

పీరీక్షా కేంద్రాల కు సమీపంలో జీరాక్స్ సెంటర్లు ఉంటే వాటిని మూసివేయించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఇద్దరు ఏఎన్ఎంలతో మెడికల్ క్యాం ప్లు ఏర్పాటు చేయాలన్నారు.

పరీక్షాకేంద్రాలలో విద్యార్దుల సంఖ్య అధారంగా పోలీసు భద్రత ,ప్రిస్కింగ్ కోసం మహిళ పోలీసు సిబ్బందిని ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు నిరంతరం విద్యుత్ సరఫరా వుండేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నా

పరీక్షాకేంద్రాలలో విద్యార్దుల సంఖ్య అధారంగా పోలీసు భద్రత ,ప్రిస్కింగ్ కోసం మహిళ పోలీసు సిబ్బందిని ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు నిరంతరం విద్యుత్ సరఫరా వుండేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
Updated at - Mar 17 , 2025 | 12:34 PM