అంగరంగ వైభవంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
ABN, Publish Date - Mar 20 , 2025 | 07:43 PM
కదిరి పున్నమిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న బ్రహోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవాన్ని గురువారం వైభవంగా జరిగింది. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆల యంలో శ్రీదేవి, భూదేవి సమేత నరసింహస్వామికి సుప్రభాత సేవతో ప్రారం భించి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు.

కదిరి పున్నమిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న బ్రహోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం గురువారం వైభవంగా జరిగింది.

మండే ఎండలను సైతం లెక్కచేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

ముందుగా ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత నరసింహస్వామికి సుప్రభాత సేవతో ప్రారంభించి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు.

అనంతరం అర్చకులు స్వామి వారి బ్రహ్మరథానికి సంప్రోక్షణ చేపట్టారు. రథం ఎదుట హోమాలు చేశారు.

ఆలయ సేవకులు సంప్రదాయ ప్రకారం మంగళవా వాయిద్యాలతో ఆలయానికి వెళ్లి స్వామి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి, పూల పల్లకిలో స్వామి వారిని తీసుకొ చ్చి రథంపై ఆశీనులను చేశారు.

భక్తులు భారీగా తరలి వచ్చి కదిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.

స్వామి వారిని మొక్కుతున్న భక్తులు

రథోత్సవంతో సందడి చేస్తున్న యువత

రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. ప్రశాంతంగా ఉత్సవం ముగిసేందుకు చర్యలు చేపట్టారు.

రథోత్సవంలో బందోబస్తు చేస్తున్న పోలీసులు

భవనం పైకి ఎక్కి రథోత్సవం చూస్తున్న భక్తులు
Updated at - Mar 20 , 2025 | 07:48 PM