Share News

ICC : ‘చాంపియన్స్‌’ విజేతకు రూ.19.40 కోట్లు

ABN , Publish Date - Feb 15 , 2025 | 06:03 AM

చాంపియన్స్‌ ట్రోఫీ (సీటీ) ప్రైజ్‌మనీని ఐసీసీ ప్రకటించింది. దీనిలో భాగంగా విజేతకు రూ.19 కోట్ల 40 లక్షల మొత్తం దక్కనుంది. రన్నర్‌పనకు రూ.9 కోట్ల 70 లక్షలు అందుతాయి. ఇక సెమీ్‌సలో ఓడిన

ICC : ‘చాంపియన్స్‌’ విజేతకు రూ.19.40 కోట్లు

దుబాయ్‌: చాంపియన్స్‌ ట్రోఫీ (సీటీ) ప్రైజ్‌మనీని ఐసీసీ ప్రకటించింది. దీనిలో భాగంగా విజేతకు రూ.19 కోట్ల 40 లక్షల మొత్తం దక్కనుంది. రన్నర్‌పనకు రూ.9 కోట్ల 70 లక్షలు అందుతాయి. ఇక సెమీ్‌సలో ఓడిన జట్లకు రూ.4 కోట్ల 85 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. మొత్తంగా సీటీ ప్రైజ్‌మనీ దాదాపు రూ.60 కోట్లు గా ఉంది. మరోవైపు 2017లో చివరిసారి జరిగిన సీటీతో పోలిస్తే తాజా ప్రైజ్‌మనీ 53శాతం పెరగడం విశేషం. అలాగే ప్రతీ గ్రూప్‌ మ్యాచ్‌ విజేతకు కూడా రూ.29 లక్షల 46 వేలు ఇవ్వనున్నారు. ఇది కాకుండా టోర్నీలో పాల్గొనే 8 జట్లకు ప్రాతినిథ్య ఫీజు కింద రూ. కోటీ 8 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ఈనెల 19 నుంచి మార్చి 9 వరకు పాక్‌, దుబాయ్‌ల్లో ఈ మెగా టోర్నీ జరుగనుంది.

Updated Date - Feb 15 , 2025 | 06:03 AM

News Hub