Share News

ప్రజావాణికి 169 దరఖాస్తులు

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:23 AM

ప్రజావాణికి 169 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్‌ పమేలాసత్పతి తెలిపారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ దరఖాస్తులు సోమవారం స్వీకరించారు.

ప్రజావాణికి 169 దరఖాస్తులు
దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పతి

సుభాష్‌నగర్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణికి 169 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్‌ పమేలాసత్పతి తెలిపారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ దరఖాస్తులు సోమవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని ఆశ్రయిస్తారని, ఆ అర్జీలను సంబంధిత శాఖ అధికారులు స్వీకరించి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్‌దేశాయ్‌, లక్ష్మికిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌, డీఆర్వో వెంకటేశ్వర్లు, కరీంనగర్‌ ఆర్డీవో వెంకటేశ్వర్లు, హుజురాబాద్‌ ఆర్డీవో రమేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:23 AM