Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ అహాన్ని పక్కనపెట్టాలి
ABN , Publish Date - Apr 04 , 2025 | 03:52 AM
కంచ గచ్చిబౌలి భూములలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.

సుప్రీం ఆదేశాలు అమలు చేయాలి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూములలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఇకనైనా ఆలోచన మార్చుకుని, వ్యక్తిగత అహాన్ని పక్కనపెట్టి సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సూచించారు. అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని కోరారు.