బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా రామాంజనేయులు
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:26 PM
గద్వాల జిల్లా నూతన అధ్యక్షుడిగా రామాంజనేయులు నియామకం అయ్యారు.

గద్వాల, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతాపార్టీ జోగుళాంబ గద్వాల జిల్లా నూతన అధ్యక్షుడిగా రామాంజనేయులు నియామకం అయ్యారు. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర ఎలక్షన్ కో-రిటర్నింగ్ ఆఫీసర్ కే.గీతామూర్తి ప్రకటించారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అక్కల రమాదేవి, బండల వెంకట్రాములు నియామకమయ్యారు.