తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించొచ్చు
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:18 AM
వేసవిలో తక్కువనీటితోనే ఆరుతడిపంటల్లో అధికదిగుబడి సాధించవచ్చని జిల్లా భూగర్భజలశాఖ అధికారి బాలు అన్నారు.

మద్దిరాల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): వేసవిలో తక్కువనీటితోనే ఆరుతడిపంటల్లో అధికదిగుబడి సాధించవచ్చని జిల్లా భూగర్భజలశాఖ అధికారి బాలు అన్నారు. శనివారం మండలకేంద్రంలోని చాయతీకార్యదర్శులు,రైతులు,మహిళాసంఘాల సభ్యులు,వ్యవసాయాధికారులతో ప్రపం చ జల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నీటిని వథా చేయకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఇంకుడుగుంతలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రైతులతో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. స మావేశంలో ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఏవో అనూషరోహి, ఎనజీవో చైర్మన నర్సింహాచారి, అధికారులు కురమయ్య, షఫీదోద్దీన, చంద్రశేఖర్, సైదులు, నాగయ్య, ఏపీవో వెంకన్న, ఏపీఎం మైసయ్య పాల్గొన్నారు.