Home » Nagarjuna Sagar
ప్రస్తుత ఖరీఫ్ (వానాకాలం) సీజన్లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 98,570 ఎకరాలకు సాగు నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
గోదావరి పరిధిలోని శ్రీరాంసాగర్ నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. ప్రాజెక్టులోకి 12 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఉన్న జైక్వాడి ప్రాజెక్టుకు 48 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది.
హైదరాబాద్ మహా నగరానికి భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా మల్లన్న సాగర్ నుంచి
Telangana: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 3,00,995 క్యూసెక్కులు ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుత నిల్వ సామర్థ్యం 298.300 టీఎంసీలుగా ఉంది.
కొద్దిరోజులుగా భారీగా వస్తున్న వరదతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండాయి. ఇంకా నిలకడగా వరద వచ్చిచేరుతుండటంతో ఆల్మట్టి నుంచి నాగార్జునసాగర్ దాకా ప్రాజెక్టుల గేట్లన్నీ తెరిచి ఉంచారు.
ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆరు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో రెండు లక్షల క్యూసెక్ల నీరు కిందకు విడుదల చేయనున్నారు. జులై 25వ తేదీన శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి భారీగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం వచ్చి చేరింది.
Telangana: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. వరద నీరు అధికంగా పోటెత్తడంతో గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఈరోజు ఉదయం సాగర్ గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 13, 14 గేట్లను ఎత్తివేశారు. ఈ రెండు గేట్లను దాదాపు ఐదు అడుగుల మేర ఎత్తేవేసి నీటిని విడుదల చేశారు.
ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ నాగార్జునసాగర్ జలాశయానికి వడివడిగా చేరుతోంది. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో సాగర్ నిండు కుండలా మారింది. జలాశయంలో నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరువ కావడంతో సోమవారం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. క్రమంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రేపు (సోమవారం) ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు.
ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ జలాశయం శరవేగంగా నిండుతోంది. సోమవారం సాయంత్రానికల్లా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.