మాస్క్ ధరించి ధర్మశాలకు బయలుదేరిన యుజ్వేంద్ర చాహల్
ABN , First Publish Date - 2020-03-11T01:08:01+05:30 IST
దేశంలో కరోనా భయం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఫేస్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా భయం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఫేస్ మాస్క్తో కనిపించాడు. ఢిల్లీ నుంచి దక్షిణాఫ్రికాతో తొలి వన్డే జరగనున్న ధర్మశాలకు వెళ్తూ విమానంలో తీసుకున్న సెల్ఫీని ట్వీట్ చేశాడు.
మూడు వన్డేల సిరీస్ కోసం ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టు భారత్ చేరుకుంది. కరోనా భయం కారణంగా కరచాలనాలకు దూరంగా ఉండాలని ఆ జట్టు భావిస్తోంది. ఆ జట్టు హెచ్కోచ్ మార్క్ బౌచర్ మాట్లాడుతూ.. తమకు గొప్ప మెడికల్ టీం ఉందని, తాము ఏం చేయాలో, ఏం చేయకూడదో సలహాలు ఇస్తోందని పేర్కొన్నాడు. షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడమే మంచిదని భావిస్తున్నట్టు చెప్పాడు. కరోనా వైరస్ గురించి గత రాత్రి వైద్య సిబ్బంది అన్ని వివరాలు చెప్పారని, ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాడు. వైద్య సంబంధిత విషయాల గురించి తమకేమీ తెలియదని, కాబట్టి వారు చెప్పినట్టు నడుకుంటామని బౌచర్ వివరించాడు.