అనధికార లేఅవుట్లలో ఇళ్లస్థలాలు కొని మోసపోకండి

ABN , First Publish Date - 2021-09-09T05:23:22+05:30 IST

అనధికార లేఅవుట్లలో ఇళ్లస్థలాలు కొనుగోలు చేసి మోసపోకండని ఎంపీడీవో లీలామాధవి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బసినికొండ, కొత్తపల్లె పంచాయతీల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా వేసిన లేఅవుట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు.

అనధికార లేఅవుట్లలో ఇళ్లస్థలాలు కొని మోసపోకండి
బసినికొండలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయిస్తున్న ఎంపీడీవో

మదనపల్లె రూరల్‌, సెప్టెంబరు 8: అనధికార లేఅవుట్లలో ఇళ్లస్థలాలు కొనుగోలు చేసి మోసపోకండని ఎంపీడీవో లీలామాధవి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బసినికొండ, కొత్తపల్లె పంచాయతీల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా వేసిన లేఅవుట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. బసినికొండ పంచాయతీలో సర్వే నెం.43-5, 44-2, 44-3ల్లో, అదేవిధంగా కొత్తపల్లె పంచాయతీలో సర్వే నెం.384-3లో  అనుమతి లేకుండా లేఅవుట్లు వేశారన్నారు.   పంచాయతీ కార్యదర్శులు పద్మాకుమారి, గోవర్దన్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-09-09T05:23:22+05:30 IST