వంతెన నిర్మించారు.. అప్రోచ్ మరిచారు
ABN , First Publish Date - 2022-04-25T05:13:28+05:30 IST
మండలంలోని వెల్లంపల్లి సమీపంలో గుండ్లకమ్మనదిపై నిర్మించ తలపెట్టిన వం తెన నిర్మాణం పూర్తయినా దానికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు (వంతెన నుంచి ప్రధాన రహదారికి ) ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని
గుండ్లకమ్మ బ్రిడ్జి
ప్రయాణికుల అవస్థలు
త్రిపురాంతకం, ఏప్రిల్ 24 : మండలంలోని వెల్లంపల్లి సమీపంలో గుండ్లకమ్మనదిపై నిర్మించ తలపెట్టిన వం తెన నిర్మాణం పూర్తయినా దానికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు (వంతెన నుంచి ప్రధాన రహదారికి ) ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 2007లో అప్పటి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి చొరవతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. నిర్మాణంలో భాగంగా 12 పిల్లర్లకు గాను నాలుగు పిల్లర్లను ని ర్మించిన గుత్తేదారు ఖర్చులు పెరిగిపోవడంతో చేతు లెత్తేశారు. అప్పటి నుంచి సుమారు 9 ఏళ్ల పాటు దీని పనులు సాగకపోవడంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి శిద్దా రాఘవరావు అదనపు నిదులు మంజూరు చేయించి 2016 ఆగస్టులో పనులను పునః ప్రారంభించారు. అయితే 247 మీటర్ల బ్రిడ్జి నిర్మాణం, 400 మీటర్ల సీసీ రోడ్డు పూర్తయ్యాయి. 2019 మార్చి 9న వంతెనను ప్రారంభించారు. కానీ వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్డు మాత్రం నిర్మించలేదు. అప్రోచ్ రోడ్డు నిర్మించేందుకు రెండు వైపులాభూమికోసం ప్రయత్నాలు చేసినా భూయజమానుల నుంచి అంగీకారం రాలేదు. దీంతో నిర్మాణం నిలిచింది. అక్కడికక్కడే తక్కువ మలుపులో మట్టిని తోలి ద్విచక్రవాహనాలు మాత్రమే వెళ్లేందుకు తాత్కాలిక ఏర్పాటు చే శారు. దీనికి తోడు ఆమూలమలుపులకు, వంతెన చివరి భాగాలకు రక్షణ గోడలులేవు. ఇనుపచువ్వలు బ యటకు కనిపిస్తూ ప్ర మాదభరితంగా ఉన్నా యి. కానీ తప్పనిసరి పరి స్థితులలో ద్విచక్ర వాహనదారులు మాత్రం వం తెనపై అలానే ప్రయాణిస్తున్నారు. ట్రాక్టర్లు, కార్లు, లారీలు, ఆటోలు మా త్రం పాడుపడిపోయిన పాత చప్టాపైనే వె ళుతున్నాయి. నేలచప్టానే ఉండటంతో వర్షాకాలంలో సాగర్ కాలువకు నీరు విడుదలైనపుడు గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహించి చప్టాపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీనికితోడు పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వంతెన పనులు మొత్తం పూ ర్తయితే ఎర్రగొండపాలెం, మా ర్కాపురం, దర్శి నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల వారికి ప్రయాణ ఇబ్బందులు తొలగుతాయి. త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం మండలాల్లోని వారు కురిచేడు, దొనకొండ, దర్శి, ముండ్లమూరు, ఒం గోలు ప్రాంతాలకు వెళ్లేందుకు, ఒంగోలు, దర్శి, పొదిలి ప్రాంతాలవారు హైదరాబాద్ వెళ్లేందుకు సుమారు 50 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీనికి తోడు చందవరం వద్ద ప్రముఖ బౌద్ధక్షేత్రం, దొనకొండ వద్ద విమానాశ్రయం, పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయనున్నందున ఈ వంతెన నిర్మాణం ఎంతో ఉపయోగకరం.
