హోరాహోరీగా ఖోఖో పోటీలు

ABN , First Publish Date - 2023-01-11T00:43:34+05:30 IST

కాకినాడ జేఎన్టీయూకే క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న సౌత్‌జోన్‌ అంతర విశ్వవిద్యాలయ ఖోఖో టోర్నమెంట్‌ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి.

హోరాహోరీగా ఖోఖో పోటీలు

ధర్వాడ్‌,భారతీయార్‌, ఏఎన్‌యూ,మదురై కామరాజు, కన్నూర్‌, మైసూర్‌, కాకినాడ జేఎన్టీయూకే వర్సిటీలు ముందంజ

పర్యవేక్షించిన పరిశీలకులు, అధికారులు, కోచ్‌లు

జేఎన్టీయూకే, జనవరి 10: కాకినాడ జేఎన్టీయూకే క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న సౌత్‌జోన్‌ అంతర విశ్వవిద్యాలయ ఖోఖో టోర్నమెంట్‌ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన పోటీలలో తెలంగాణా యూనివర్శిటీపై ధర్వాడ్‌లోని అగ్రికల్చర్‌ సైన్సెస్‌ యూనివర్శిటీ ఖోఖో జట్టు 19-8 స్కోర్‌ తేడాతోనూ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్శిటీపై భారతీయార్‌ యూనివర్శిటీ జట్టు 22-9 స్కోర్‌ తేడాతోనూ గెలుపొందినట్లు వర్శిటీ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శి, టోర్నమెంట్‌ కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్‌ జి.శ్యామ్‌కుమార్‌ తెలిపారు. అదేవిదంగా ఏఎన్‌యూ జట్టు పాలమూరు యూనివర్శిటీ జట్టుపై 25-10 స్కోర్‌ తేడాతోనూ మదురై కామరాజు యూనివర్శిటీ జట్టు బెంగుళూరులోని యూనివర్శిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సైన్సె్‌సపై 18-12, విజయనగర శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీపై కన్నూర్‌ యూనివర్శిటీ జట్టు 13-12 స్కోర్‌ తేడాతో గెలుపొందాయి. మహాత్మాగాంధీ యూనివర్శిటీ జట్టుపై మైసూర్‌ యూనివర్శిటీ జట్టు 15-13 స్కొర్‌ తేడాతోనూ యోగివేమన యూనివర్శిటీపై కాకినాడ జేఎన్టీయూకే ఖోఖోజట్టు 13-12 స్కోర్‌ తేడాతో విజయం సాధించాయి. అదేవిధంగా యూనివర్శిటీ ఆఫ్‌ మద్రాస్‌, ఉస్మానియా యూనివర్శిటీ జట్టు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంజట్టు సంబంధిత ప్రత్యర్ధి జట్లపై గెలుపొందాయన్నారు. ఈ పోటీలు ఈనెల 12 వరకూ కొనసాగుతాయని శ్యామ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2023-01-11T00:43:36+05:30 IST