Varla Ramaiah: టీడీపీ నేతలపై జగన్‌రెడ్డి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు

ABN , First Publish Date - 2023-09-01T20:08:25+05:30 IST

తెలుగుదేశం నేతలపై సీఎం జగన్‌రెడ్డి(CM Jagan Reddy) తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నేత వర్ల రామయ్య(Varla Ramaiah) మండిపడ్డారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి(Ayyannapatrudu) అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు.

Varla Ramaiah: టీడీపీ నేతలపై జగన్‌రెడ్డి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు

అమరావతి: తెలుగుదేశం నేతలపై సీఎం జగన్‌రెడ్డి(CM Jagan Reddy) తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నేత వర్ల రామయ్య(Varla Ramaiah) మండిపడ్డారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి(Ayyannapatrudu) అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. గురువారం నాడు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు ఉండవా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులపై ఎన్ని కేసులు పెట్టాలి? అని నిలదీశారు. ఎస్సీ, బీసీలు అంటే జగన్ ప్రభుత్వానికి ఎందుకంత చులకన భావం అని అడిగారు.రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచుతున్నారనే నెపంతో తీసుకొచ్చిన సెక్షన్ 153(A) ను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు.టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.చట్టం కొందరికి చుట్టం కాకుండా చూడాల్సిన పోలీసులు ఇలా వ్యవహరించడం దుర్మార్గమని వర్ల రామయ్య మండిపడ్డారు.

Updated Date - 2023-09-01T20:08:25+05:30 IST