ఏపీ సమగ్రాభివృద్ధే జనసేన పార్టీ లక్ష్యం
ABN , First Publish Date - 2023-10-09T23:37:01+05:30 IST
ఏపీ రాష్ట్ర సమ గ్రాభివృద్ధే లక్ష్యం గా జనసేన పార్టీ అధినేత పవనకళ్యాణ్ ముం దుకెళుతున్నారని ఆపార్టీ నేత శ్రీరా మ రామాంజనేయులు పేర్కొన్నా రు.

మదనపల్లె, అక్టోబరు 9: ఏపీ రాష్ట్ర సమ గ్రాభివృద్ధే లక్ష్యం గా జనసేన పార్టీ అధినేత పవనకళ్యాణ్ ముం దుకెళుతున్నారని ఆపార్టీ నేత శ్రీరా మ రామాంజనేయులు పేర్కొన్నా రు. మదనపల్లె మండలం సీటీ ఎం పంచాయతీ రైల్వేగేట్ ప్రాం తం, బజా రువీధి, మంగళవీధి ఏరియాల లో సోమవారం జనం కోసం జనసే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా నియోజ కవర్గంలోని ప్రతి ఒక్కరినీ కలసి వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడబోయే జనసేన, టీడీపీ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు న్నారు. ముఖ్యంగా పవన కళ్యాణ్ ఏపీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి చేస్తున్న పోరా టానికి సంబంధించిన కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, హరిహరన, హరిప్రసాద్, ్ట గోపాలకృష్ణ, శంకర్, పతి, సుప్రీం హర్ష, సోను, సీటీఎం నుంచి చిన్నరెడ్డి, గంగాధర్, గణపతి, గోపీ, చలపతి, సత్యనారాయణ, వెంకట రమణారెడ్డి, టి.రవీంద్ర, పూజారి రమేష్, పూజారి శ్రీనివాస్, .సురేంద్ర, చలపతి, ధనాం జనేయులు, మహేష్, బబ్లు, శశిభూషన, గణేష్, సోమశేఖర్ పాల్గొన్నారు.