TDP: నిరాహార దీక్షలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ

ABN , First Publish Date - 2023-09-15T14:11:13+05:30 IST

కృష్ణా జిల్లా: గన్నవరంలో టీడీపీ నేతలు చేస్తున్న నిరాహార దీక్ష ప్రాంగణానికి నందమూరి రామకృష్ణ చేరుకున్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

TDP: నిరాహార దీక్షలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ

కృష్ణా జిల్లా: గన్నవరంలో టీడీపీ నేతలు (TDP Leaders) చేస్తున్న నిరాహార దీక్ష (Hunger Strike) ప్రాంగణానికి నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) చేరుకున్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు (Janasena Leaders), కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అన్ని పార్టీల నేతలు శిబిరం వద్దకు వచ్చి దీక్షలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాష్ట్రంలో నిరాహార దీక్షలు చేస్తున్న వారందరికీ తన మద్దతు తెలుపుతున్నానని, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) టీడీపీకి మద్దతు తెలిపినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను ముఖ్యమంత్రి చేసే వరకు అందరం కలిసి పోరాడుదామని పిలుపిచ్చారు. మొరిగే వైసీపీ (YCP) నాయకుల కుక్కలను తరిమి తరిమి కొడదామని నందమూరి రామకృష్ణ అన్నారు.

Updated Date - 2023-09-15T14:11:13+05:30 IST