Share News

Nandyala: శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం

ABN , Publish Date - Dec 31 , 2023 | 10:29 AM

నంద్యాల: శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. రాత్రుల సమయంలో అవుటర్ రింగ్ రోడ్డులో చిరుతపులి సంచరిస్తోంది. రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం దగ్గర గోడపై కూర్చుని ఉన్న చిరుతపులిని స్థానికులు, చుట్టుపక్కలవారు చూశారు.

Nandyala: శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం

నంద్యాల: శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. రాత్రుల సమయంలో అవుటర్ రింగ్ రోడ్డులో చిరుతపులి సంచరిస్తోంది. రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం దగ్గర గోడపై కూర్చుని ఉన్న చిరుతపులిని స్థానికులు, చుట్టుపక్కలవారు చూశారు. అటుగా వచ్చిన యాత్రికులు చిరుతపులి ఫోటోలను చిత్రీకరించారు. చిరుతపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత మూడు నెలల కిందట అవుటర్ రింగ్ రోడ్డులోని రుద్రాపార్కు సమీపంలో గోడపై కూర్చుని చిరుతపులి కనిపించింది. మళ్ళీ ఇప్పుడు కనిపించింది. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి చిరుత దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ప్రస్తుతం చిరుత పోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నంద్యాల జిల్లా శ్రీశైలంలో రోజురోజుకి చిరుత పులుల సంచారం పెరుగుతూ ఉంది. మూడు నెలల క్రితం శ్రీశైలంలోని రుద్రా పార్క్ వద్ద చిరుతపులి కనిపించింది. కొందరు భక్తులు తమ ఫోన్లలో చిరుతను వీడియో తీశారు. చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత పులి సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Dec 31 , 2023 | 10:29 AM