Srikakulam: సభ్యులు మినహా ఎవరూ కూర్చోకూడని జడ్పీ సమావేశంలో...

ABN , First Publish Date - 2023-04-09T15:57:36+05:30 IST

శ్రీకాకుళం: ఆయన ఓ కీలక నేత కుమారుడు.. అతనికి ఏ పదవీ లేదు.. అయితేనేం శ్రీకాకుళం జిల్లా సర్వసభ్య సమావేశంలో ప్రత్యక్షమయ్యారు.

Srikakulam: సభ్యులు మినహా ఎవరూ కూర్చోకూడని జడ్పీ సమావేశంలో...

శ్రీకాకుళం: ఆయన ఓ కీలక నేత కుమారుడు.. అతనికి ఏ పదవీ లేదు.. అయితేనేం శ్రీకాకుళం జిల్లా సర్వసభ్య సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. తండ్రి వేదికపై ఉంటే .. కుమారుడు జడ్పీ సభ్యుల మధ్య కూర్చున్నాడు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Seetaram) కుమారుడు చిరంజీవి నాగ్ (Chiranjeevi Nag) హంగామా చేశాడు. సభ్యులు మినహా ఎవరూ కూర్చోకూడని జడ్పీ సమావేశంలో సభ్యులతో పాటు నాగ్ కూర్చున్నాడు. సభ్యులు, అధికారులకు మాత్రమే ఆహ్వానం ఉన్న సమావేశంలో నాగ్ ముందు వరుసలో కూర్చోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అధికారపార్టీ కీలకనేత కుమారుడు కావడంతో జడ్పీ అధికారులు సయితం సభ్యులతో సమావేశమైన ప్రొటోకాల్ ఇచ్చేశారు.

Updated Date - 2023-04-09T15:57:36+05:30 IST