Share News

Natti Kumar: జగన్ నిర్ణయాలతో విసిగిపోయా.. త్వరలోనే టీడీపీలో చేరతా

ABN , Publish Date - Dec 30 , 2023 | 09:19 PM

Natti Kumar: ఏపీ సీఎం జగన్‌పై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ రాజధాని పేరుతో జగన్ బూటకపు డ్రామా ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో పాలన మొత్తం రెడ్డి కులస్థుల చేతుల్లో జగన్ పెట్టారని నట్టికుమార్ విమర్శించారు. అందుకే త్వరలోనే తాను చంద్రబాబును కలిసి టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు.

Natti Kumar: జగన్ నిర్ణయాలతో విసిగిపోయా.. త్వరలోనే టీడీపీలో చేరతా

ఏపీ సీఎం జగన్‌పై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ రాజధాని పేరుతో జగన్ బూటకపు డ్రామా ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్రను మోసం చేసేందుకు రాజధాని పేరుతో జగన్‌ ఆడుతున్న నాటకం బూటకమనే విషయం ఈ ప్రాంత ప్రజలు గుర్తించారని అన్నారు. శుక్రవారం చోడవరంలోని పూర్ణా థియేటర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాను గతంలో వైసీపీకి సానుభూతిపరుడిగా ఉండేవాడినని.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో విసిగిపోయానని నట్టికుమార్ తెలిపారు.

ఏపీలో పాలన మొత్తం రెడ్డి కులస్థుల చేతుల్లో జగన్ పెట్టారని నట్టికుమార్ విమర్శించారు. అందుకే త్వరలోనే తాను చంద్రబాబును కలిసి టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. తమలాంటి వాళ్లను వైసీపీ తమ స్వార్థానికి వినియోగించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన చర్చి ఆస్తులను సొంతం చేసుకుంటున్నారని నట్టి కుమార్ ఆరోపించారు. ఈ ఆస్తులను అమ్మడానికి లేదా కొనడానికి వీలు లేదన్నారు. అయినా సరే అధికారం అడ్డుపెట్టుకుని చర్చికి కెనడా వాసులు ఇచ్చిన భూములను దోచేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి గెలుపు ఖాయమని నట్టి కుమార్ జోస్యం చెప్పారు. విజనరీ లీడర్ చంద్రబాబు ఆలోచన విధానానికి ప్రజా బలం ఉన్న పవన్‌ కళ్యాణ్ లాంటి నేత తోడవడంతో వైసీపీ అధినేత జగన్‌కు మతిపోతోందని నట్టి కుమార్ ఎద్దేవా చేశారు.


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 30 , 2023 | 09:19 PM