పవన్కల్యాణ్కు వీడ్కోలు
ABN , First Publish Date - 2023-01-14T00:37:07+05:30 IST
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సుభద్రాపురం వద్ద గురువారం ‘యువశక్తి’ పేరిట నిర్వహించిన సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్కల్యాణ్ శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు.

గోపాలపట్నం, జనవరి 13:
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సుభద్రాపురం వద్ద గురువారం ‘యువశక్తి’ పేరిట నిర్వహించిన సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్కల్యాణ్ శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న పవన్కల్యాణ్కు పార్టీ నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.