Share News

కేజీహెచ్‌కు ఎన్‌టీపీసీ రూ.2 కోట్ల విరాళం

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:18 AM

కేజీహెచ్‌ అభివృద్ధి నిమిత్తం సింహాద్రి ఎన్‌టీపీసీ అధికారులు గురువారం కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిరప్రసాద్‌ను కలిసి రూ.రెండు కోట్లు చెక్‌ను అందజేశారు.

కేజీహెచ్‌కు ఎన్‌టీపీసీ రూ.2 కోట్ల విరాళం

కేజీహెచ్‌కు ఎన్‌టీపీసీ రూ.2 కోట్ల విరాళం

మహారాణిపేట, మార్చి 27 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌ అభివృద్ధి నిమిత్తం సింహాద్రి ఎన్‌టీపీసీ అధికారులు గురువారం కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిరప్రసాద్‌ను కలిసి రూ.రెండు కోట్లు చెక్‌ను అందజేశారు. ఆధునిక వైద్య పరికరాల కొనుగోలు, ఆపరేషన్‌ ధియేటర్ల అబివృద్ధి, డయాలసిస్‌ యంత్రాల కొనుగోలు ఈ నిధులను వినియోగించనున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివానంద తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌టీపీసీ అధికారులు సమీర్‌శర్మ, బీబీ పాత్ర, కె.ప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:18 AM