నేడు టీడీపీ అధినేత చంద్రబాబు రాక
ABN , First Publish Date - 2023-05-31T01:04:33+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బుధవారం విశాఖ రానున్నారు.

అచ్యుతాపురం, మే 30:
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బుధవారం విశాఖ రానున్నారు. సాయంత్రం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి నాలుగు గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి అచ్యుతాపురంలో గల టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గం ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు నివాసానికి వెళతారు. ఇటీవల వివాహమైన నాగేశ్వరరావు కుమారుడు రాజు, కోడలు భాను దంపతులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు విశాఖలోని పోర్టు స్టేడియానికి చేరుకుంటారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి ఏడు గంటలకు వుడా పార్కులో బి.వెంకటరమణ యాదవ్ కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరవుతారు. అనంతరం ఎయిర్పోర్టుకు చేరుకుని విజయవాడ బయలుదేరి వెళతారు.