Former Punjab Assembly Speaker: చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ బీజేపీలో చేరిక

ABN , First Publish Date - 2023-05-05T11:06:30+05:30 IST

పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ శుక్రవారం బీజేపీ తీర్థం స్వీకరించారు...

Former Punjab Assembly Speaker: చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ బీజేపీలో చేరిక
Charanjit Singh Atwal joins BJP

న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ శుక్రవారం బీజేపీ తీర్థం స్వీకరించారు.(Charanjit Singh Atwal joins BJP)భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ బీజేపీలో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్ 19వతేదీన అకాలీదళ్ ప్రాథమిక సభ్యత్వానికి అత్వాల్ రాజీనామా చేశారు. అత్వాల్ 14వ లోక్ సభలో 2004 నుంచి 2009 వరకు లోక్ సభ డిప్యూటీ స్పీకరుగా కూడా పనిచేశారు. ఫిల్లూర్ లోక్ సభ స్థానం నుంచి గతంలో ప్రాతినిథ్యం వహించారు.గతంలో శిరోమణి అకాలీదళ్ సభ్యుడైన అత్వాల్ రెండు సార్లు పంజాబ్ అసెంబ్లీ స్పీకరుగా(Former Punjab Assembly Speake) పనిచేశారు. చరణ్ జిత్ అత్వాల్ కుమారుడు ఇందర్ ఇక్బాల్ సింగ్ అత్వాల్ అతని సహచరులు ఆదివారం బీజేపీలో చేరనున్నారు.

Updated Date - 2023-05-05T11:06:30+05:30 IST