BRS MLA: కర్ణాటకలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కారుకు ప్రమాదం

ABN , First Publish Date - 2023-06-24T15:12:41+05:30 IST

బీఆర్‌ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటక రాష్ట్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటకలోని కార్కళ వద్ద రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శృంగేరి పీఠాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా మంగళూరు సమీపంలో ముడూరు - నల్లూరు క్రాస్ వద్ద ఎమ్మెల్యే కారు టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది.

BRS MLA: కర్ణాటకలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కారుకు ప్రమాదం

హైదరాబాద్: బీఆర్‌ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి (BRS MLA Pilot Rohith Reddy) పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక రాష్ట్రంలోని కార్కళ వద్ద ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శనివారం శృంగేరి పీఠాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా మంగళూరు సమీపంలో ముడూరు - నల్లూరు క్రాస్ వద్ద ఎమ్మెల్యే కారు టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. దీంతో కారు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే కారు ప్రమాదం నుంచి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన కార్కళ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరో వాహనంలో శృంగేరికి పంపించారు. ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురయ్యారని తెలిసి కుటుంసభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రమాదం నుంచి ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కారు ప్రమాదం నుంచి తాను సురక్షితంగా బయటపడ్డానని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, దేవుని ఆశీస్సులతో ప్రమాదంలో తనకేమీ కాలేదని రోహిత్ రెడ్డి చెప్పారు.

Updated Date - 2023-06-24T15:40:17+05:30 IST