Share News

Andhra Pradesh: సీబీఎన్ సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐకు గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Aug 20 , 2024 | 08:23 PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా.. సీబీఎన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గెజిట్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది...

Andhra Pradesh: సీబీఎన్ సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐకు గ్రీన్ సిగ్నల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా.. సీబీఎన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గెజిట్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.


కండిషన్స్ అప్లై..!

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • ఏపీలో సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి

  • సీబీఐ విచారణకు అనుమతి ఇస్తూ గెజిట్‌ విడుదల

  • కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్‌ సంస్థలపై..

  • నేరుగా సీబీఐ విచారణకు ఏపీ ప్రభుత్వం అనుమతి

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో..

  • రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ గెజిట్‌

  • జూలై-01 నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడి

  • 2014-19 టీడీపీ హయాంలో సీబీఐకి అనుమతి నిరాకరణ


నోటిఫికేషన్..

  • ఏపీలో CBI విచారణ పరిధిని కొనసాగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్

  • ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం 1946లోని..

  • సెక్షన్-03 ప్రకారం విచారణ పరిధి పెంచుతూ ఆదేశాలు

  • CBI విచారణకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్

  • CBI పరిధిలో నిర్ధేశించిన నేరాల విచారణ కోసం ఏపీ ప్రభుత్వ అనుమతి

Updated Date - Aug 20 , 2024 | 08:23 PM