Share News

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టిన అమరావతి రైతులు..

ABN , Publish Date - Jun 13 , 2024 | 05:04 PM

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్తున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు అమరావతి రైతులు(Amaravati farmers) అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా పూలు చల్లి మహిళలు హారతులు పట్టారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టిన అమరావతి రైతులు..

అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్తున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు అమరావతి రైతులు(Amaravati farmers) అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా పూలు చల్లి మహిళలు హారతులు పట్టారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంలో భారీ పూలదండలతో ఆయనకు స్వాగతం పలికారు. వారిని చూసిన చంద్రబాబు తన కాన్వాయ్ నుంచి దిగి రైతులకు అభివాదం చేశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు.


సీఎం చంద్రబాబు ప్రయాణించే రోడ్డుమార్గం మొత్తం అమరావతి రైతులు పూలతో నింపేశారు. సీడ్ యాక్సెస్, మందడం, వెలగపూడి రోడ్ల మీదుగా సచివాలయం వరకు రకరకాల పూలతో రహదారులు నిండిపోయాయి. ఐదేళ్ల తర్వాత అమరావతి అభివృద్ధికి అడుగులు పడనుండడంతో చిన్న, పెద్ద, కులం, మతం తేడా లేకుండా స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొనడంతో మందడంలో భారీ జన సందోహం నెలకొంది. పెద్దఎత్తున బాణసంచా కాలుస్తూ చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు.

ఇవి కూడా చదవండి:

Nuzvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఛాన్స్‌లర్ కె.సి.రెడ్డిని అడ్డుకున్న ఉద్యోగులు

AP Politics: చిత్తుచిత్తుగా ఎందుకు ఓడిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోండి: ఎమ్మెల్సీ అనురాధ

Updated Date - Jun 13 , 2024 | 05:04 PM