Share News

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 02 , 2024 | 11:36 PM

కడప కార్పొరేషన పరిధిలో ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించాలని కమిషనరు వైఓ నందన అధికారులకు ఆదేశించారు.

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న కమిషనర్‌ వైఓ నందన

- కార్పొరేషన కమిషనర్‌ నందన

కడప (ఎర్రముక్కపల్లె), సెప్టెంబరు 2 : కడప కార్పొరేషన పరిధిలో ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించాలని కమిషనరు వైఓ నందన అధికారులకు ఆదేశించారు. సోమవారం కడప కార్పొరేషన మీడియా కాన్ఫరెన్స హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు తీసుకుని సంబంధిత అధికారులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వారం వచ్చిన సమస్యలను ఏ మేరకు పరిష్కరించారో వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుతం వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణం పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేషన వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 11:36 PM