Share News

CM Pinarayi Vijayan: కేరళ కాదు ‘కేరళం’

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:07 AM

కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సోమవారం అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది.

CM Pinarayi Vijayan: కేరళ కాదు ‘కేరళం’

పేరు మార్చాలంటూ అసెంబ్లీలో తీర్మానం

తిరువనంతపురం, జూన్‌ 24: కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సోమవారం అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అధికారపక్ష యూడీఎ్‌ఫతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ మద్దతు తెలిపాయి. మలయాళం భాషలో కేరళను ‘కేరళం’ అని పిలుస్తారని, దాన్నే ఖరారు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ ఈ తీర్మానాన్ని ఆమోదించారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో పేర్కొన్న అన్ని భాషల్లోనూ ఈ పేరే రాసేవిధంగా సవరణలు చేయాలని కోరారు.

Updated Date - Jun 25 , 2024 | 03:08 AM