Share News

Karnataka: మాజీ సీఎంపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ మృతి

ABN , Publish Date - May 28 , 2024 | 03:12 PM

తన కుమార్తెపై బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన మహిళ మృతి చెందిందని పోలీసులు వెల్లడించారు.

Karnataka: మాజీ సీఎంపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ మృతి

బెంగళూరు, మే 28: తన కుమార్తెపై బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన మహిళ మృతి చెందిందని పోలీసులు వెల్లడించారు. ఆమె గత కొంత కాలంగా ఉపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతుందని తెలిపారు. ఆ క్రమంలో హులిమావ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మరణించిందని చెప్పారు.

అయితే బిఎస్ యడ్యూరప్పపై నమోదైన లైంగిక దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతుందని వారు వెల్లడించారు. తన కుమార్తెపై మాజీ సీఎం యడ్యురప్ప లైంగిక దాడి చేశారంటూ సదాశివనగర్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఏడాది మార్చి 14న యడ్యూరప్పపై పోలీసులు పోక్స్ చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 354ఏ (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

For More National News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 03:12 PM