Share News

Raj Tarun: ముందస్తు బెయిల్‌ కోసం నటుడు రాజ్‌తరుణ్‌ పిటిషన్‌

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:42 AM

ఓ మహిళను మోసం చేశారనే ఆరోపణలతో నార్సింగి పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ సినీ నటుడు రాజ్‌తరుణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Raj Tarun: ముందస్తు బెయిల్‌ కోసం నటుడు రాజ్‌తరుణ్‌ పిటిషన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఓ మహిళను మోసం చేశారనే ఆరోపణలతో నార్సింగి పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ సినీ నటుడు రాజ్‌తరుణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్‌తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పేర్కొంటూ లావణ్య అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం రాజ్‌తరుణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ శ్రీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై పోలీసుల వైఖరి తెలియజేయాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావుకు ఆదేశాలు జారీచేసింది. విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.


  • రాజ్‌తరుణ్‌ నాకొద్దు: లావణ్య

రాజ్‌తరుణ్‌ తనకే కావాలంటూ ఇన్నాళ్లూ నానా యాగీ చేసిన లావణ్య చివరికి మాట మార్చారు. ఇకపై రాజ్‌తరుణ్‌తో కలసి ఉండాలని తాను కోరుకోవడం లేదని మీడియా ముందు స్పష్టం చేశారు. మరోవైపు, లావణ్య నుంచి తమకు ప్రాణహాని ఉందని.. తమకేదైనా జరిగేతే ఆమెనే బాఽధ్యురాలని పేర్కొంటూ రాజ్‌తరుణ్‌ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Aug 02 , 2024 | 04:42 AM