Share News

Telangana: చీకట్లు నింపిన హోలీ.. నదిలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృతి..

ABN , Publish Date - Mar 25 , 2024 | 04:36 PM

హోలీ పండుగ వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెను విషాదం నెలకొంది. కొమరం భీం ( Komaram Bheem ) జిల్లా తాటిపల్లి వద్ద వార్దా నదిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు నదిలో గల్లంతయ్యారు. లోతు సరిగా అంచనావేయకపోవడం వల్ల ఒక్కొక్కరుగా మునిగిపోయారు.

Telangana: చీకట్లు నింపిన హోలీ.. నదిలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృతి..

హోలీ పండుగ వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెను విషాదం నెలకొంది. కొమరం భీం ( Komaram Bheem ) జిల్లా తాటిపల్లి వద్ద వార్దా నదిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు నదిలో గల్లంతయ్యారు. లోతు సరిగా అంచనావేయకపోవడం వల్ల ఒక్కొక్కరుగా మునిగిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టగా నలుగురు యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. అందరూ 25 ఏళ్ల లోపే కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు నదీమాబాద్ కు చెందిన సంతోష్ కుమార్ , ప్రవీణ్ , సాయి, కమలాకర్ గా గుర్తించారు. స్పాట్ కు చేరుకున్న మృతుల కుటుంబీకులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించాయి.

Kejriwal: మా నాయకుడిని జైలులో పెట్టారు.. మేము హోలీ ఆడము.. అతిశి కీలక ప్రకటన

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 25 , 2024 | 04:40 PM