Share News

TSPSC: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్..

ABN , Publish Date - Aug 16 , 2024 | 09:49 PM

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ముఖ్య ప్రకటన వెలువరించింది. అక్టోబర్ 21నుంచి 27వ తేదీ వరకు జరిగే పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు వెల్లడించింది.

TSPSC: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్..

TSPSC: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ఓ ముఖ్య ప్రకటన వెలువరించింది. అక్టోబర్ 21నుంచి 27వ తేదీ వరకు జరిగే పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు వెల్లడించింది. మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30గంటల వరకు నిర్వహించే పరీక్షా సమయాన్ని మారుస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. పరీక్షా సమయాన్ని మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మారుస్తున్నట్లు తాజాగా ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది. కావున అభ్యర్థులు ఈ మార్పును గమనించాలని కోరింది.

Updated Date - Aug 16 , 2024 | 09:50 PM