Share News

Kishan Reddy: ఒక్క రోజూ సెలవు లేకుండా పని చేసిన ప్రధాని మోదీ: కిషన్ రెడ్డి

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:31 PM

ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశ ప్రజల కోసం గడిచిన 10 ఏళ్లలో ఒక్కరోజూ సెలవు పెట్టకుండా పని చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy: ఒక్క రోజూ సెలవు లేకుండా పని చేసిన ప్రధాని మోదీ: కిషన్ రెడ్డి

మహబూబ్‌నగర్: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశ ప్రజల కోసం గడిచిన 10 ఏళ్లలో ఒక్కరోజూ సెలవు పెట్టకుండా పని చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "ఏప్రిల్‌లో లోక్ సభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. గత పదేళ్లలో కొనసాగిన అవినీతిరహిత పాలన కావాలా, కాంగ్రెస్ అవినీతి పాలన కావాలా అనేది తేల్చే ఎన్నికలివి. తొమ్మిదన్నరేళ్లలో ఒక్క సెలవు తీసుకోకుండా మోదీ పని చేస్తే.. ఒక్క రోజూ సెక్రటేరియట్ రాకుండా పని చేసిన వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్. కలగానే మిగిలిపోయిన అయోధ్య రామమందిర నిర్మాణాన్ని చేపట్టి మోదీ చరిత్రలో నిలిచారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక 9 ఏళ్లల్లో దేశంలో ఒక్క చోటా అల్లర్లు జరగలేదు. సర్జికల్ స్ట్రైక్ చేయించి పాకిస్థాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాదులను చంపిన చరిత్ర మోదీది. అలా పాకిస్థాన్‌ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టగలిగారు. కుటుంబ పాలన చేసే కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓట్లు వేయొద్దు. దేవరకద్రలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయించే బాధ్యత నాది" అని కిషన్ రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2024 | 03:31 PM