Share News

Ravindra Naik: మేడిగడ్డకు బీజేపీ నేతలు ఎందుకెళ్లలేదు

ABN , Publish Date - Feb 14 , 2024 | 06:08 PM

బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్లకపోవడాన్ని ఆ పార్టీ నేత రవీంద్ర నాయక్ ( Ravindra Naik) తప్పు పట్టారు.

 Ravindra Naik: మేడిగడ్డకు బీజేపీ నేతలు ఎందుకెళ్లలేదు

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్లకపోవడాన్ని ఆ పార్టీ నేత రవీంద్ర నాయక్ ( Ravindra Naik) తప్పు పట్టారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రజల్లో ఉందన్నారు.మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డకు వెళ్లకపోవడం వల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. బీజేపీలో ఉన్న సీనియర్ లంబాడా నాయకుడిని తానేనని తెలిపారు. తనకు లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ టికెట్ ఇవ్వాలని అడిగారు. గతంలో మంత్రిగా, ఎంపీగా ఆ ప్రాంతంలో పని చేసిన అనుభవ ఉందని... అందుకే నల్గొండ టికెట్ అడుగుతున్నానని కనీసం బీజేపీ నేతలు పట్టించుకునే పరిస్థితిల్లో లేరని మండిపడ్డారు.

Updated Date - Feb 14 , 2024 | 06:08 PM