Share News

Raj Tarun-Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసులో కీలక మలుపు..

ABN , Publish Date - Sep 10 , 2024 | 06:19 PM

తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్-లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్.. రెండ్రోజులకో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో లావణ్య కేసు తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. రాజ్ తరుణ్-మాల్వీలను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నట్లు లావణ్య వీడియోలను రిలీజ్ చేసిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది.

Raj Tarun-Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసులో కీలక మలుపు..
Raj Tarun-Lavanya Case

తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్-లావణ్య కేసులో (Raj Tarun-Lavanya Case) రోజుకో ట్విస్ట్.. రెండ్రోజులకో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో లావణ్య కేసు తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. రాజ్ తరుణ్-మాల్వీలను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నట్లు లావణ్య వీడియోలను రిలీజ్ చేసిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా చోరీ జరిగిందని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేయడంతో మరోసారి సంచలనమైంది.


Malvi-And-Lavanya.jpg

ఇదీ అసలు కథ..

తన ఇంట్లో చోరీ జరిగిందని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న బంగారంను రాజ్ తరుణ్ సహాయంతో మాల్వీ దొంగతనం చేశారని ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నారు. ఇప్పటికే ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్‌లో మాల్వీపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మాల్వీ తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసిందని ఫిర్యాదులో క్లియర్‌గా రాసుకొచ్చారు లావణ్య. మొత్తం రూ.12 లక్షల విలువైన బంగారం చోరీ జరిగిందని లావణ్య చెబుతున్నారు. పెళ్లికి సంబంధించిన ఆధారాలు మాయం చేసేందుకు.. రాజ్‌తరుణ్‌ ప్రయత్నించాడని లావణ్య ఆరోపిస్తున్నారు. తాళితో పాటు కీలక డాక్యుమెంట్లు తీసుకెళ్లారని రాజ్ తరుణ్, మాల్వీ తీసుకెళ్లారని ఇద్దరిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ముంబై లో 352 , 351(2) కింద కేసులు నమోదు అయ్యాయని.. ముంబైలో తనను అవమానించి, దాడి చేశారని లావణ్య మీడియాకు వెల్లడించారు. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా వలన ప్రాణాహాని ఉందని ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నారు. కాగా.. ఇటీవలే ముంబైలో హీరో రాజ్ తరుణ్-మాల్వీలను రెడ్ హ్యాండెడ్‌గా లావణ్య పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వీడియోలను మీడియాకు రిలీజ్ చేయడంతో ఇదొక సంచలనమే అయ్యింది.


Lavanya.jpg

చార్జిషీట్ దాఖలు

రాజ్ తరుణ్, లావణ్య కేసులో తాజాగా కూడా ఓ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తనకు కావాలని లావణ్య డిమాండ్ చేస్తోంది. మరోవైపు పోలీసులు ఈ కేసులో రాజ్ తరుణ్‌ నిందితుడేనని చెబుతున్నారు. రాజ్ తరుణ్, లావణ్య పదేళ్ల పాటు సహ జీవనం చేశారని కూడా పోలీసులు చెబుతున్నారు. రాజ్‌తరుణ్-లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్‌తరుణ్‌ పదేళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు. పదేళ్లపాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని చార్జిషీట్‌లో తెలిపారు. లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. అయితే ఈ విషయమై ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో లావణ్య మాట్లాడుతూ.. రాజ్ తరుణ్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం శుభ పరిణామమని తెలిపింది. తనను ఎన్నో మాటలు అన్నారని.. చివరికి న్యాయం గెలుస్తుందని తాను భావిస్తున్నానని పేర్కొంది. రాజ్ తరుణ్‌కి వ్యతిరేకంగా వెళ్లాలని తనకు లేదని తెలిపింది. తనకు రాజ్ తరుణ్ కావాలని పేర్కొంది.


Raj-Tarun-and-Lavanya.jpg

అవును.. పదేళ్లు.. నిజమే

రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత మానసికంగా ఎంతో బాధపడ్డానని వెల్లడిచింది. శేఖర్ భాష అనే వ్యక్తిని అస్త్రంగా ఉపయోగించి తనపై ఎన్నో నిందలు వేశారని లావణ్య పేర్కొంది. రాజ్ తరుణ్ శిక్ష అనుభవించాలని తాను కోరుకోను, కానీ తనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానని వెల్లడించింది. రాజ్ తరుణ్, తాను పదేళ్లపాటు కలిసి సంసారం చేశామనేది అనేది వాస్తవమని లావణ్య తెలిపింది. వాటికి సంబంధించిన ఆధారాలన్నీ పోలీసులకు ఇచ్చానని వెల్లడించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా వల్ల తనను రాజ్ తరుణ్ వదిలించుకోవాలని చూశాడని పేర్కొంది. కేసును తప్పుదోవ పట్టించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ఇద్దరికీ ఎఫైర్ ఉందని మరోమారు లావణ్య తెలిపింది. వాటికి సంబంధించిన ఆధారాలను సైతం పోలీసులకు ఇచ్చానని లావణ్య వెల్లడించింది.

Updated Date - Sep 10 , 2024 | 08:07 PM